బోధన్ ప్రతినిధి, జూలై 30: (ప్రజా గళం)
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం ఖాజా పూర్ గ్రామంలో భారీ వర్షాల దాటికి ఓ నివాస గృహం కూలిపోయింది.ఇంటి స్లాబ్,రేకులు,గోడలు నేలమట్టమయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.బాధిత కుటుంబా నికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

