బాన్సువాడ, మార్చ్ 5 ప్రజా గళం: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు మార్చ్ 5 నేటి నుండి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించామని, దీనిని స్కాన్ చేసి కెటాయించిన సెంటర్ లకు విధ్యార్థులు సకాలంలో చేరుకోవాలని, పరీక్షా కేంద్రం లోనికి సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని, సిసి కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

