బాన్సువాడ టౌన్ ప్రజా గళం:
బాన్సువాడ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి, బస్తీ దవాఖానను మంగళవారం కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ ఫ్రాన్సిస్ జేవియర్, డాక్టర్ తంగ్ పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, వ్యాదుల గురించి ఆరా తీశారు. బస్తీ దవాఖాన పరిదిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై నివేదికను జాతీయ వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించనున్నట్లు వివరించారు.

