ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ప్రముఖ జర్నలిస్టు కర్క రమేష్-సుస్మిత దంపతులు వినియోగించుకున్నారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్ర ఆయుధం అని ఓటు ద్వారా మనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే గొప్ప అవకాశం అని, అర్హులైన ఓటు హక్కు ఉన్న
ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నిజామాబాద్ లో నివాసం ఉండే తాము ఓటు దర్పల్లి పోలింగ్ స్టేషన్ 112 లో ఉండటంతో దర్పల్లి జడ్పీఎచ్ ఎస్ కు రావడం జరిగిందని తెలిపారు.

