బాన్సువాడలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ.

 

బాన్సువడ,ప్రజా గళం.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారా యణ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ఐక్యత, సమగ్రత ను చాటాలని పిలుపునిచ్చారు. ‘నా దేశం.. నా జెండా.. నా గౌరవం’ అనే నినాదం ప్రతి భారతీయుడి హృద యంలో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, బీజేపీ కౌన్సిలర్‌ గజ్జల మహేష్‌, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు ప్రసాద్‌ కిషన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, నసురుల్లాబాద్‌ మండల అధ్యక్షుడు హనుమాన్లు, ధార్మిక సెల్‌ జిల్లా కన్వీనర్‌ శ్రీనివాస్‌ పంతులు, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, శ్యామల శ్రీకాంత్‌, పాశం భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌, కొండని గంగారం, సాయిబాబా, యోగి, పురుషోత్తం, సచిన్‌, ప్రదీప్‌, మహేందర్‌, పద్మ, నరేష్‌, సాయిరెడ్డి, భూమేష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.