వేసవి తీవ్రత నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ నివారణ పోస్టర్ల ఆవిష్కరణ.

 

 

నిజామాబాద్ వైద్య విభాగం ఏప్రిల్ 30 ( ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ పోస్టర్ల ఆవిష్కరణను జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ ) కె.కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్రమైన వడగాలులు వేగంగా వీస్తున్నాయని,

వేసవికాలం ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండడం, వడగాలులు తీవ్రత పెరగడం వల్ల జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ ముఖ్యంగా వడదెబ్బ సంబంవిoచినప్పుడు తీవ్రమైన శరీర ఉష్ణోగ్రత పెరగడం, తీవ్రమైన తలనొప్పి ,నాడి వేగంగా కట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక లేక పూర్తిగా ఆప స్మార కానికి చేరుకొని స్పృహ కోల్పోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రధమ చికిత్సలో భాగంగా వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి, వడదెబ్బ తగిలిన వారికి ఉప్పు కలిపిన మజ్జిగను, కొబ్బరి నీళ్లను, నిమ్మరసంలో గ్లూకోజు మరియు ఓఆర్ ఎస్ కలిపిన నీటిని త్రాగించాలన్నారు. ప్రధమ చికిత్స చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి లేదా ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా బయట తిరగడం, ఆడటం, చేయరాదు తప్పనిసరీ పరిస్థితిలో ఎండలోకి వెళితే గొడుగు, టోపీ, చల్లని రుమాళ్లను తప్పక ధరించాలి, తేల్లని నూలు వస్త్రాలు మాత్రమే వాడాలి. నీరు మరియు ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి, మత్తుపానియాలు తీసుకోరాదు, వడదెబ్బకు గురైన వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి అత్యంత అవసరం అయితేనే బయటకు వెళ్లాలని ముఖ్యంగా పిల్లలు వృద్దులు గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా చేయవలసినవి ఏమిటంటే గొడుగు వాడడం, తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, టోపీ ,రుమాలు పెట్టుకోవడం ఒప్పు కల్పిన మధ్యలో లేదా గ్లూకోజు కలిపిన నీరు త్రాగను ఓరల్ డిహైడ్రేషన్ ద్రావణం త్రాగడం, వడదెబ్బకి గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే తీసుకువెళ్లడం. తడి గుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండడం, ఐస్ నీటిలో బట్టలు ముంచి శరీరం అంత తుడవాలి ,శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల లోపల వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాన్ కింద ఉండాలి, వడదెబ్బకు గురి అయిన వారిలో మంచి మార్పులు లేనిచో , శీతాకాల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి , మంచినీళ్లు ఎక్కువసార్లు తీసుకోవాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాస్ మంచినీళ్లు త్రాగి వెళ్లాలి, ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసం గాని, కొబ్బరి నీళ్ళు లేదా చల్లని మజ్జిగ త్రాగాలి,తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తల తిరుగుట మొదలైన అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గర్లో ఉన్న వైద్యుల్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తల తిరుగుట మొదలైన ఆనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గర్లో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి.

వడ దెబ్బకు గురి అయిన వారు చేయకూడని పనులు ముఖ్యంగా సూర్యకిరణాలకు, వేడిగాలికి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గురికాకూడదు ,గొడుగు లేకుండా ఎండలోతిరగరాదు, వేడి నీటిలో ముంచిన బట్టతో తుడవరాదు, దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లడంలో నిర్లక్ష్యం , ఆలస్యం,చేయరాదు. ఎండలో బయట నుండి వచ్చిన వెంటనే ఇంటిలో తీపి పదార్థాలు మరియు తేనె తీసుకో రాదు ,శీతల పానీయములు ,మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుందన్నారు. వడదెబ్బ నివారణకై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఆశ లు వారి వారి గృహ సందర్శనలో ప్రథమ చికిత్స మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను తమ వద్ద ఉంచుకొని గృహ సందర్శనం లో వడదెబ్బకు గురైన వ్యక్తులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలు వారు పని చేసే వద్ద సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో పనిపెట్టకుండా జాగ్రత్తలు పాటించడం, వారికి కనీస మౌలిక సౌకర్యాల కల్పన కల్పించడం, అనగా టెంటు, త్రాగునీరు, ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించడంతోపాటు

గొడుగు, టోపీ ,రుమాలు లాంటివి వాడుకునేలా అవగాహన కలిగించాలని సూచించడం జరిగింది. వడదెబ్బకు గురయ్యే వారిలో హైరిస్కు గ్రూపులైన చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్దులు ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారిని ప్రత్యేక జాగ్రత్తలతో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. తరచుగా నీటిని తీసుకోవడం, చిన్నపిల్లలు మూత్రం తక్కువగా రావడం వల్ల కలిగే నష్టాలపై వివరించడం జరుగుతుందన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వడదెబ్బకు నివారణకు ఏర్పాటుచేసిన జిల్లా టోల్ ఫ్రీ నంబర్ 93906539692 నకు సంప్రదించవచ్చు అన్నారు. శీతల పానీయాలు, కార్బోనేటెడ్ ద్రావణాలు ఫ్రిడ్జ్ వాటర్ కు బదులు మట్టితో చేసిన కుండా లేదా రంజన్ లో నీటిని ప్రతిరోజు సుమారు మూడు నుంచి ఐదు లీటర్లు వరకు తరచుగా కొద్దికొద్దిగా తీసుకోవాలని, నిమ్మరసం, రాగిజావ కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి సేవించాలన్నారు. ఒకవేళ వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలో ప్రాణాపాయం సంభవించినట్లయితే మండల స్థాయిలో ఉన్న 3 మ్యాన్ కమిటీ ధ్రువీకరణ తప్పనిసరి అయిన తర్వాతే వడదెబ్బ మరణంగా పరిగణించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వేసవికాలంలో జిల్లా ప్రజలు ఎవరు కూడా వడదెబ్బకు గురికాకుండా అన్ని ప్రాథమిక , పట్టణ

ఆరోగ్య కేంద్రాలలో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ మందులను ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఉంచడం జరిగిందని అదేవిధంగా అంగన్వాడి కేంద్రాల్లో బస్ డిపోలలో, గ్రామపంచాయతీలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిఓఎన్సిడి డాక్టర్ వెంకన్న, డాక్టర్ అశ్విని, డాక్టర్ స్వాతి, డాక్టర్ శ్రావ్య, వెంకటేష్, వేణుగోపాల్, నాగరాజు, నారాయణ, సుధాకర్, పృద్వి, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.