నిజామాబాద్ రూరల్ (ప్రజాగళం టౌన్ ):
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని వెంకట్ రామ్ తండా, అమ్రాబాద్ వాస్తవ్యులు బాణావత్ రాములు కు తలకు ప్రమాదం కావడంతో అతని పరిస్థితి అతి తీవ్రంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారిని కలిశారు. చికిత్స కోసం డబ్బులు లేనందున వారికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అవసరమయ్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పించడానికి ఎల్ వో సి లేఖను ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు డిసెంబర్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

