అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం.

ఆర్మూర్ ఫిబ్రవరి 21 ( ప్రజా గళం ) ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రమాదవాషత్తు చెత్తకు పెట్టిన నిప్పు డేరాకు తగలబడి సీతారామారావు 75 అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక వివరాల్లోకి వెళ్తే సుమారు 15 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతూ వెంచర్లో ఓ డేరా వేసుకొని నివాసముంటున్నట్లు మృతుడి కొడుకు రామేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 

Leave A Reply

Your email address will not be published.