బాన్సువాడ, మే 21, ప్రజాగళం.
రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుంచి ఆఫందీఫారం వరకు సిఆర్ఆర్ గ్రాంట్ రూ. 50 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డుకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

