బోధన్ ప్రతినిధి,డిసెంబర్ 11: (ప్రజా గళం)
మొదటి విడత ఎన్నికలలో భాగంగా బోధన్ మండలం భవానిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పోలింగ్ బూత్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం సందర్శించారు.ఆయా పోలింగ్ బూత్ ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు,భద్రతా చర్యలను పరిశీలించారు.ఈ సందర్బంగా సంబంధిత అధికారుల తో మాట్లాడుతూ..ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావ రణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసర మైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని,సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని,సూచించారు.
ప్రజలు శాంతి యూత వాతావరణంలో తమ ఓటు హక్కు ను సధ్వినియోగం పర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్బంగా బోధన్ ఏ.సి.పి పి.శ్రీనివాస్,బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి,సంబంధిత అధికారు లు,సిబ్బంది ఉన్నారు.

