బోధన్ ప్రతినిధి,జనవరి 24 : (ప్రజా గళం)
రాబోయే బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపు న పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకుడు రజాక్ తెలిపారు.ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.బోధన్ మున్సిపాలిటీలో ఉన్న 38 స్థానా ల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఎవరైనా తమ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకున్న వారు తమను సంప్రదించాలని కోరారు.జాగృతి నుంచి పోటీ చేయదలచిన వారికి ఎన్నికల కమిషన్ సింహం గుర్తు కేటాయించిందన్నారు. ఈ సమావేశంలో నాయ కులు ప్రవీణ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

