దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 21( ప్రజాగళం)

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుకన్నారు.దీపావళి పండుగ వెలుగులు ప్రతి ఇంటిని ఆనందంతో, ప్రతి హృదయాన్ని ఆశతో నింపాలని కోరుకుంటున్నానన్నారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ప్రజల సంక్షేమం ఈ పండుగతో మరింతగా వృద్ధి చెందాలి,” అని ఆకాంక్షించారు.., “శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో వెలిగించిన దీపాలతో ప్రారంభమైన ఈ పండుగ చెడుపై మంచి గెలుపు అనే సందేశాన్ని తరతరాలుగా మనకు అందిస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.